జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం
తాడిపత్రి: జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం సొమవారం మధ్యాహ్నం తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్.డి.టి రూమ్స్ ఎదురుగా ఉండే పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో యాడికిలోని వెంగమనాయుడు కాలనీకు చెందిన 15 మంది, బుగ్గ గ్రామంనకు చెందిన 10 మంది, పెద్దవడుగురు మండలం అప్పేచర్ల గ్రామంనకు చెందిన 5 మంది, చీమలవాగుపల్లె గ్రామంకు చెందిన 5 గురు జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. వీరికి శ్రీకాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు అయిన తన దృష్టికి తీసుకురావాలని త్వరలో గ్రామ పర్యటన కార్యక్రమం మొదలుపెట్టి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో పర్యటించి.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ, సిద్దాంతాలు వివరించి పార్టీనీ బలోపేతం చేస్తూ మండల కమిటీలు మరియు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది.
అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే మండల నాయకులు మరియు జనసైనికులు అందరు సంసిద్ధం కావాలని, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన తనకు తెలియజేయాలని కార్యకర్తలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని.. ఏ సమస్య వచ్చిన తాను చూసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-25-at-2.14.32-PM-1024x768.jpeg)