నో మై కాన్స్టిట్యూఎన్సీ- కరకంబాడి కాలనీలో వినుత కోటా పర్యటన
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీలోని కరకంబాడీ కాలనీలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు, పారిశుధ్యం సమస్య, సీసీ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు తదితర సమస్యలను కాలనీ వాసులు శ్రీమతి వినుతకు తెలియజేశారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు భాగ్య లక్ష్మి, త్యాగరాజులు, పార్థసారధి, బాలాజీ, మోహన్, జనసైనికులు తిలక్, సాయి చందు, రూపేష్, గోపి, కిరణ్, మురుగ, రాజు, లోకేష్, శీను, శివ, బాబు, శంకర్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-14-at-2.20.40-PM-1024x461.jpeg)