నేటి నుండి రాత్రి 9.30వరకు మెట్రో రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ మెట్రో రైళ్ల రాకపోకల సమయాన్ని అధికారులు పొడిగించారు. గత కొన్ని నెలలుగా దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెట్రో రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు విరామాలతో రాత్రి 9:00 గంటల వరకు రైళ్లను నడిపారు. అయితే రద్దీ పెరగడంతో రైళ్ల సమయాలను మరో అరగంట పాటు 9:30 గంటల వరకు పొడిగించారు. ప్రతి మూడు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.