ఓటు వేసే ముందు ఆలోచించండి

బీహార్‌లో ఈరోజు తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం లో సినీ నటుడు, సోషల్ యాక్టివిస్ట్ సోనూ సూద్ బీహార్ ఓటర్లకు తెలివిగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బీహార్‌లోని ప్రజలు ఏ రోజైతే వలస వెళ్లకుండా తమ రాష్ట్రంలోనే ఉపాధి పొందుతారో ఆరోజే దేశానికి నిజమైన విజయమన్నారు. తన ట్వట్టర్ హ్యాండిల్‌లో సోనూసూద్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.