జనసైనికుడికి భరోసా ఇచ్చిన బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో కారు ప్రమాదానికి గురై కాలికి తీవ్ర గాయం అయిన జనసైనికుడు బండారు కొండబాబుని వారి స్వగృహం నందు పరామర్శించి, జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని తరువాత చేయబోయే వైద్య ఖర్చు నిమిత్తం 10,000/₹ రూపాయలు ఆర్థిక సహాయం చేసి, తన దాతృ గుణాన్ని మరోమారు చాటుకున్నారు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి శ్రీమతి మరియు “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు ‘నిడిగట్ల’ జనసేన శ్రేణులు ఉన్నారు.