సియాటల్, వాషింగ్టన్ జనసేన ప్రవాసాంధ్రులకు కృతజ్ఞతలు తెలిపిన పూతలపట్టు జనసేన

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లి గ్రామంలో ప్రభుత్వ పథకాలను అందడం లేదని, గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు, అక్రమంగా అరెస్టు చేసి, 45 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న జనసైనికులకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, సియాటల్, వాషింగ్టన్ ఎన్నారై బృందం మూలింటి గురు భాస్కర్, గంగిపాముల భాస్కర్, నందకిషోర్, కిరణ్ ఉజ్జిన, నవీన్ మెట్టు, కిషోర్ బొబ్బర లు వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చి 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జనసైనికులకు ప్రతినిత్యం అండగా నిలుస్తూ జన సైనికులకు మనోధైర్యాన్ని నింపుతున్న సియాటల్, వాషింగ్టన్ ప్రవాస ఆంధ్రులకు పూతలపట్టు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, మండల అధ్యక్షులు బండారు మనోహర్, బి కుమార్, కె పురుషోత్తం, రాజశేఖర్, కోడి చంద్రయ్య, శీను మరియు నాయకులు హరీష్, త్యాగరాజులు, ప్రభాకర్, వెంకటేష్, తులసి బాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.