అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపుతాం

  • తిరుపతి నియోజకవర్గ జనసేన ఎన్నికల పరిశీలకులు అతికారి కృష్ణ
  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
  • ఉప్పరపల్లిలో అట్టహాసంగా కూటమి నేతలు ఎన్నికల ప్రచారం

రాజంపేట: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను అవినీతిమయంగా మార్చివేసి అవినీతి పాలనకు తానే రారాజు అంటూ, ఎదుగుతున్న వైయస్ జగన్ ను జరగబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల పరిశీలకులు అతికారి కృష్ణ, జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్యలు అన్నారు. మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో బుధవారం కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ, కూటమి నేతలు అట్టహాసంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ, బ్యాలెట్ నమూనా ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ పరిశీలకుడు అధికారి కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి గజమాల వేసి శాలువాతో సత్కరించారు.