భావితరాలకు ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం మన బాధ్యత

సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, జనసేన నాయకుల విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో ఈ మధ్యకాలంలో కొన్ని జరిగిన సంఘటనలు మరియు పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉందనిపిస్తుంది. ఆయన భద్రత విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం సన్నగిల్లుతుంది. పవన్ కళ్యాణ్ ప్రాణం ఆయనకు ముఖ్యమో కాదో మాకు తెలియదు కానీ, మనలాంటి కోట్లాది మంది బడుగు, బలహీన, అట్టడుగు పేద, బహుజన వర్గాలకు ఎంతో ముఖ్యం. మన రాష్ట్రానికి, భావితరాలకు ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి శ్రీ పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వం యొక్క జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి మరియు కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు అమిత్ షా లకు విజ్జప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి, నిమ్మకాయల రాము, జిల్లా కార్యదర్శి బొగ్గారం శ్రీనివాస్, సీనియర్ నాయకులు మల్లెపూల మధు మరియు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు.