బాధితులకు న్యాయం చేయమని కోరితే అక్కడి నుండి పారిపోయిన స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని దర్గాహొన్నూర్ గ్రామంలో విద్యుత్ వైర్లు పడి నలుగురు కూలీలు మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పరామర్శించి హృదయ విదారక ఈ ఘటనపై ఆరా తీసి మృతుల మరియు గాయపడిన కూలీల వివరాలు తెలుసుకొని అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కక్కరికి 25లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పక్కా ఇళ్ళు కట్టించాలని, భూమి లేని వారికి 2ఏకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. అదే సమయంలో అటుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డితో చిలకం మధుసూధన్ రెడ్డి బాధితులను ఆదుకోవాలని న్యాయం జరిగే రకంగా తక్షణమే 25 లక్షల రూపాయలు మరియు వారికి పక్కా ఇళ్ళు కట్టించాలని కోరగా నిర్లక్ష్యపు సమాధానంగా మీరు మాకు చెప్పకూడదు, మీకు హక్కు లేదు అని నిర్లక్ష్యంగా మాట్లడారు. ప్రతిపక్షాలకు బాధితుల పక్షాన మాట్లాడే హక్కు ఉంటుందని, వారి పక్షాన పోరాటం చేసే హక్కు ఉంటుందని మాట్లాడుతుంటే తక్షణమే అక్కడి నుండి పారిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గౌతమ్, జిల్లా సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్ కుమార్, మూప్పూరి క్రిష్ణ, బొమ్మనహల్ మండల అధ్యక్షులు శివ రాజ్, మండల అధ్యక్షులు గోపాల్, కేశవ్, రంజిత్, మధు, కోటికి రామాంజి, పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్, దాడితోట కృష్ణయ్య, హరి శంకర్ నాయక్, సూర్య నాయక్, మల్లేష్ గౌడ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.