మాటుగర్రు గ్రామాన్ని సందర్శించిన జనసేన నాయకులు

అల్లూరి సీతారామరాజు, జిల్లా అరకు నియోజకవర్గం, పెదబయలు మండలం కీముడుపల్లి పంచాయితీ మాటుగర్రు గ్రామాన్ని సందర్శించిన జనసేన మండల ఆధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, జనసైనికులు, గ్రామంలో మంచినీటి సౌకర్యం లేదని అలాగే సిసి రోడ్డు సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు పవన్ కుమార్ కు తెలిపారు. స్పందించిన పవన్ కుమార్ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాసమస్యలపై స్పందించే లక్షణాలేవి కనిపించట్లేదని పంచాయితీ నిధులు లాక్కుని ఎలా గ్రామ అభివృద్ధి చేస్తుందని నమ్మి ఓటు వేసి మనం అందరు మోసపోయాం ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్ నిర్ణయించే రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి కొణిదెల పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడి జనసేన పార్టీ గెలిపించుకుందాం. అలాగే మీకు ఇదివరకే జనసేనపార్టీ సిద్ధాంతాలు చెప్పియున్నాము జనసేనపార్టీ నిర్దిష్ట్య లక్ష్యాలు, ఆశయాలు, గిరిజనులకు మేలు చేసే జనసేన అధినేత ఆలోచనలు కచ్చితంగా అమలు చేయగలరు. మనమంతా నిస్వార్దముగా పార్టీ బలోపేతనికి కృషి చేద్దామని మాటుగర్రు గ్రామ ప్రజలకు జాగరపు పవన్ కుమార్ (మండల అధ్యక్షులు) జనసైనికులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గణేష్, సురేష్, కళ్యాణ్, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.