కామరాజుపేట గ్రామంలో జనం కోసం జనసేన 599వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 599వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 400 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 100760 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 600వ రోజు కార్యక్రమాన్ని సోమవారం గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవి తెలిపారు. ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గోకవరం మండల కార్యదర్శి నీలం నాగేంద్ర, కామరాజుపేట నుండి కరణం సూరిబాబు, జాజుల అశోక్, నీలం నాని, వెలిశెట్టి దుర్గాప్రసాద్, బిక్కిల్లి శివ, దాసరి దుర్గాప్రసాద్, జాజుల అభిషేక్, జాజుల పవన్, తాలపరెడ్డి రాజేష్, నీలం నాని, కొత్తపల్లి నుండి మాదారపు ధర్మేంద్ర, వనుం ప్రదీప్, మాదారపు విక్రం సాయి, పల్లా చందు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు పాటంశెట్టి శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు.