పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మాని జగనన్న కాలనీలపై దృష్టి పెట్టండి: మరీదు శివరామకృష్ణ

నూజివీడు, ఆదివారం నూజివీడు మండలం సిద్ధార్థ నగరలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ మాట్లాడుతూ జోగి రమేష్ పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మాని జగనన్న కాలనీలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ గ్రామంలో మౌళిక సదుపాయాలు అందుబాటులో లేకుండా ఇల్లు నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. నూజివీడు మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్, ముసునూరు మండల జనరల్ సెక్రెటరీ ప్రేమ్ చంద్ సిద్ధార్థ్ నగర్ జనసైనికులు శివ, కోటి, గోపి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.