ఘనంగా దామలూరు జనసేన పార్టీ గ్రామ నూతన కమిటీ సమావేశం

మైలవరం: ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో దామలూరు జనసేన పార్టీ గ్రామ కమిటీని ప్రకటించటం జరిగింది. దాములూరు గ్రామ అధ్యక్షునిగా పంది శ్రీను, ఉపాధ్యక్షులుగా గణేష్ మరియు నజీర్ ను గ్రామ ప్రధాన కార్యదర్శిగా రాజేష్ ను ప్రకటించడం జరిగింది. సుమారు 22 మంది సభ్యులతో ఈ కార్యవర్గం రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి అధికార ప్రతినిధి,మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధీ మాట్లాడుతూ కార్యవర్గంలోని సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దామలూరు గ్రామంలో జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమతి చింతల లక్ష్మి, శ్రీమతి రావి సౌజన్య మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.