అంతర్జాతీయ విమానాల సర్వీసులు రద్దు

ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను డిసెంబర్ 31వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం తెలిపింది. గతంలో చేసిన సస్పెన్షన్‌ను పొడిగించే క్రమంలో ఇండియా నుంచి ప్రయాణించే విమాన సర్వీసులను డిసెంబర్ 31వరకూ ఆపేశారు. డీజీసీఏ సమాచారాన్ని బట్టి ఇంటర్నేషనల్ విమానాలు కొద్ది రూట్లు వెళ్లేందుకు మాత్రమే అప్రూవల్ దొరికింది. 26-06-2020 సర్క్యూలర్ ప్రకారం.. ప్రస్తుత అథారిటీ ఈ వాయిదాను మరోసారి పొడిగించనుంది. ఇండియా నుంచి బయల్దేరాల్సిన/చేరుకోవాల్సిన కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులను 2020 డిసెంబర్ 31అర్థరాత్రి 11:59నిమిషాల వరకూ రద్దు చేశారు. ఈ నిషేదాజ్ఞలు ఇంటర్నేషనల్ కార్గో విమానాలకు వర్తించవు.