క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన

తిరుపతి, క్రిస్మస్ పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక చర్చిలో హరీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ముఖ్యఅతిథిగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. పాస్టర్ ప్రజల ఆయురారోగ్య ఐశ్వర్యాలకై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ వేడుకలలో సుధీర్, శరత్, మనోజ్, సంతోష్, సతీష్, షరీఫ్, సుజిత్, రఫీ, లోకేష్, రామకృష్ణ, శివ, హర్ష, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.