ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారం రోజుల పర్యటనకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేటి ఉదయం విశాఖకు చేరుకున్నారు.

విమానాశ్రయంలో ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఆయన నేడు సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఉపరాష్ట్రపతి సందర్శించనున్నారు.

వెంకయ్య పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.