నేడు సిద్దిపేట లో సీఎం కేసీఆర్ పర్యటన

ఈ రోజు సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ముందుగా నర్సాపూర్‌లో 163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తారు. దీంతో పాటు జిల్లాలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. ఈ క్రమంలో  సిద్దిపేట లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభించి, ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అలానే రంగ నాయక సాగర్ అతిధి గృహం ప్రారంభోత్సవం జరిపి కోమటి చెరువు అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. మిట్టపల్లిలో రైతు వేదిక, విపంచి ఆడిటోరియం ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు.

ఇండస్ట్రియల్ పార్క్ లో ఐ టీ టవర్ ప్రారంభోత్సవం కూడా కేసీఆర్ చేయనున్నారు. ఇక పలు ఐ టీ కంపెనీ లతో సీఎం అద్వర్యం లో ఎం ఓ యూ లు కూడా కుదుర్చుకోనున్నారు. ఇక బాబు జగజ్జీవన్ రావు సర్కిల్ లో నూతన ఆడిటోరియం కి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్ జిల్లా పార్టీ కార్యాలయం అయిన టీ ఆర్ ఎస్ భవన్ ను కూడా ప్రారంభించనున్నారు. చివరగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో కేసిఆర్ పాల్గొననున్నారు.