ప్రమాదంలో గాయపడిన బాధితునికి పంతం నానాజీ పరామర్శ
కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామ జనసేన నాయకులు శాండీ సోదరుడు ఇటీవల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ కుసుమ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ శుక్రవారం ఆసుపత్రికి వెళ్ళి బాదితుడిని పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-20-at-10.18.05-PM-1024x461.jpeg)