వీరమహిళలకు చీరలు అందజేసిన రాటాల రామయ్య

  • పవనన్న ప్రజా బాట 54వ రోజు

ఒంటిమిట్ట: పవనన్న ప్రజా బాట పురస్కరించుకుని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం గ్రామంలో శుక్రవారం పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమం 54వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన వీరమహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు బండి లక్ష్మీదేవి, వీరమహిళలు వనజ, పావని, సుబ్బమ్మ, సిరిమల్లి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.