బొత్స వ్యాక్యలను ఖండించిన తుమ్మి లక్ష్మీరాజ్

విజయనగరం: జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాక్యలు వెనక్కు తీసుకోవాలని ఉత్తరాంధ్ర జనసేన మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడిన వాక్యాల్లో తప్పులు వెతుకుతూ గుమ్మడి కాయలు దొంగ ఎవరా అంటే నేనే నేనే అనుకుని ముందుకొచ్చే మన జిల్లా పెద్ద నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు.. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరి కోసం మాట్లాడినా అది మమ్మల్ని అన్నట్టు భుజాలు తడుముకుంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు మీకు ఎక్కడ ఉంది నిజంగా రాష్ట్ర మీద ప్రేమ ఉంటే ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయండి, రాయలసీమని అభివృద్ధి చేయండి అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తే.. ఆయన మాత్రం మమ్మల్ని సన్నాసులు అన్నారని రాలిపోయిన పసుపు రాసుకుంటున్నారు ఇప్పటికైనా మీ వ్యాఖ్యల పైన మీ ఆచరణల పైన ఒక రకమైన ఆలోచన తెచ్చుకొని విజయనగరం అభివృద్ధి కోసమే మీకున్న రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లక్ష్మీరాజ్ తెలిపారు.