అప్పురత్న పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది బత్తుల
రాజానగరం: 72 వ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో బీసీ పేటలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పర్యటించి, స్థానిక ప్రజలతో మమేకమవుతూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం స్థానిక మీడియాతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారిందని అందుకే మా అధినేత, గౌరవనీయులు పవన్ కళ్యాణ్, జగన్ రెడ్డి కి అప్పురత్న బిరుదు ప్రధానం చేశారని దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా ఎదుగుతున్న జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మాత్రం పూర్తిగా అప్పుల కుప్పుగా మార్చేసి, రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తుందని ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం నుంచి అందరూ ఇతర రాష్ట్రాలకు వలసలు పోయి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని, ఈ పరిస్థితి నుండి గట్టెక్కాలంటే జనసైనికులు సమిష్టిగా జనసేన విజయం కోసం సోషల్ మీడియాలో కాకుండా గ్రౌండ్ లో మరింత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉందని, రాజానగరం నియోజకవర్గంలో స్థానిక వైసిపి పార్టీ వారికి ఓటమి భయంతోనే తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన పార్టీ దే విజయం తధ్యమని దానికి స్థానిక ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతు తెలియజేసి, జనసేన పార్టీని గెలిపించి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు, కాపవరం గ్రామ వాసులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-21.56.17-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-21.56.20-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-21.56.23-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-08-at-21.56.22-1024x768.jpeg)