నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టుచీరను అందజేసిన కార్పొరేటర్ కందుల

నవ వధువుకు బంగారు తాళిబొట్టు, పట్టుచీరను అందజేసిన కార్పొరేటర్ కందుల జీవిఎంసి 32 వ వార్డు కార్పొరేటర్, దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు కందుల నాగరాజు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాజకీయాలకతీతంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక 34 వ వార్డులో రాణికి బంగారు తాళిబొట్టుతో పాటు, పసుపు కుంకుమ, పట్టు చీరను, అలాగే ఇతర సామాగ్రిని అందజేశారు. తల్లిదండ్రులు చనిపోవడం తో సమీప బంధువులు నిర్వహిస్తున్న వివాహానికి కందుల నాగరాజు ముందుండి తన పూర్తి సహాయ సహకారాలను అందజేశారు. ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. ఆమెను తన కుటుంబ సభ్యులురాలిగా భావించి అన్ని తానై దగ్గరుండి వివాహం శుభప్రదం అయ్యేవిధంగా ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు తను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. ఎవరికీ ఎటువంటి కష్టం వచ్చినా తను ముందుండి వారికి తగిన సహాయాన్ని అందజేస్తానని పేర్కొన్నారు. సేవలో తను దైవాన్ని చూస్తానని చెప్పారు. సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శివప్రసాద్ రెడ్డి, వార్డు ఇన్చార్జ్ బద్రీనాథ్, కె. ఎన్. ఆర్. చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ కేదార్ నాధ్, రాజు, గణేష్, నరేష్, రఘు, త్రినాధ్, అర్జున, లక్ష్మణ్, సత్తిబాబు, జానకి, లక్ష్మీ కుమారి, అలేఖ్య, దుర్గ, రోజీ, రోహిణి తదితరులు పాల్గొన్నారు.