జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యం: రాటాల రామయ్య

  • పవనన్న ప్రజా బాట 66వ రోజు

ఒంటిమిట్ట: జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట 66వ రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం మృకుండా ఆశ్రమం, తదితర గ్రామాలలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సిద్ధాంతాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ద్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలనను దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

మేనిఫెస్టో కరపత్రాలను అందజేస్తున్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య