పవన్, కళ్యాణ్ లకు సర్వేపల్లి గ్రామస్తుల ఆత్మీయ ఆహ్వానం

పాడేరు: ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా బోర్డర్ కొరపుట్టు జిల్లా నందపూర్ మండలం సర్వేపల్లి గ్రామస్తులు ఆత్మీయ ఆహ్వానం మేరకు పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, జాగరపు కళ్యాణ్ కుమార్ సర్వేపల్లి వెళ్లారు. సర్వేపల్లి గ్రామస్తులు పూలమాలలతో వారికి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ఒడిస్సా లోని కోరపుట్టు చేరుకున్న పవన్, కళ్యాణ్ లను సర్వేపల్లి గ్రామస్తులు ఎంతో అభిమానంగా చూసుకున్నారు. ఈ సందర్బంగా పవన్, కళ్యాణ్ మాట్లాడుతూ ఇంత గా అభిమానిస్తున్న మా ఆప్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.