వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చిన వినుత కోటా

శ్రీకాళహస్తి, శాసనమండలి ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మద్దతు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థులకు సోమవారం జరగబోవు శాసనమండలి ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు వారి ఆసోసియేషన్ సభ్యులు జనసేన పార్టీ మద్దతు కోరడం జరిగింది. ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తున్న మోసాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి చేస్తున్న ఆరాచకాలను దృష్టిలో పెట్టుకొని, వైసీపీ పార్టీకి దీటుగా, నిజాయితీగా పోరాడుతున్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) ఎమ్మెల్సీ అభ్యర్థికి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకరించడమైనది. అందువలన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు అభిమానులు అందరూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన బాబు రెడ్డి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 6 కు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మేగడ వెంకటేశ్వర రెడ్డికి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 21కి మొదటి ప్రాధాన్యత (1) ఓటు వేసి గెలిపించవలసిందిగా నియోజవర్గంలోని ఓటర్లను కోరవలసిందిగా అదేవిధంగా మన నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి టౌను మరియు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహించి జనసేన అధ్యక్షులు కోరిన విధంగా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపుకు సహకరించవలసిందిగా మన శ్రేణులను పత్రికాముఖంగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మన పార్టీ కార్యకర్తలు ఎం.ఎల్.సి ఎన్నికల విషయంలో ప్రలోభాలకు గురి చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగాను ఓటర్లను ఎమ్మెల్సీ ఎన్నికల బూతులకు తరలించడంలో పిడిఎఫ్ సభ్యులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను.