శివరాత్రి వేడుకలలో పోలిశెట్టి

రామచంద్రపురం, మహాశివరాత్రి సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం కోటిపల్లి సోమేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, జగన్నాయకులపాలెం గ్రామాలలో గల శివాలయాలకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. జనసేన నాయకులు జనసైనికులు ఏర్పాటు చేసిన కూల్ డ్రింక్స్ మజ్జిగ పంపిణీల కార్యక్రమానికి మరియు రామచంద్రపురం పట్టణము లారీ యూనియన్ ఆఫీసు దగ్గర ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.