ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటి, జనసేన పార్టీ ఇంచార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియచేసారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం నాయకుడు డాక్టర్ బాబు ఇంట జరిగిన కార్యక్రమంలో విందుకి ముఖ్య అతిధిగా పాల్గొని వారితో కలిసి ఇఫ్తార్ ని స్వీకరించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ ముస్లిం సోదర కుటుంబాలతో కలిసి పండుగని జరుపుకుంటూ వారికి తమ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పండుగ శుభాకాంక్షలను తెలియచేసారు. ముత్తా శశిధర్ మాట్లాడుతూ ముస్లీంలకు అతి పవిత్ర మాసం రంజాన్ అని, పండుగకు ఓనెల ముందు నుంచే ముస్లింలు అతి పవిత్రంగా ఉపవాస దీక్షను పాటిస్తూ దాన ధర్మాలు చేస్తారు అన్నారు. దివ్య ఖురాన్‌ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది అని ఈ నెలలో ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందని తద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపులో ఉంటాయి అని నమ్మకమని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు తాను, తమ పార్టీ అన్నివిధాల తోడు ఉంటామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, సిటి ట్రెజరర్ & మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు, షేక్ మొహిద్దిన్, అహ్మద్, ఎస్.కె బషీర్ జానీ, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.