సాక్షి దినపత్రిక వార్తల్లో వ్యక్తికి – జనసేన పార్టీకి సంబంధం లేదు: పేడాడ

ఆమదాలవలస, గత కొన్ని రోజులుగా పొందూరు మండలం, బురిడి కంచరాం గ్రామానికి చెందిన గులివెందుల అసిరి నాయుడుపై వస్తున్న ఆరోపణలలో భాగంగా ఆయన జనసేన పార్టీ నాయకుడని, పొందూరు మండల జనసేన నాయకుడని వస్తున్న వార్తలను నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీని మండలంలో ఎదగకుండా చేయడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడని ఆయన విమర్శించారు. ఆయనకు, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మండల అధ్యక్షులు యలకల రమణ పత్రికా ప్రకటనలో తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగత సమస్యలు కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, ఆయన కనీసం మా పార్టీలో క్రియాశీలక సభ్యులు కూడా కారని ఈ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సాక్షి పత్రికలో వేసిన వార్తలో “జనసేన నాయకుడు కిరాణా వ్యాపారి బలి” అని ప్రచురించారు. దయచేసి ఈ వార్తను సవరించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మండల నాయకులు కొంచాడ చిన్నమనాయుడు, పొన్నాడ బాలకృష్ణ, కోంచాడ సూర్య, గార బాబూరావు, వసంత్ కుమార్, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.