కరోనాతో కాలిఫోర్నియాలో పెరుగుతున్న మరణాల సంఖ్య

కరోనా ప్రపంచ దేశాలతో పాటూ అగ్రరాజ్యం అమెరికాను కరోనా కకావికలం చేస్తోంది. కాలిఫోర్నియా కేంద్రంగా కోవిడ్ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 25 వేల మార్కును దాటేసింది. న్యూయార్క్‌లో 38 వేలు మరణాలు నమోదు కాగా.. టెక్సాస్‌ 27 వేల మంది మరణించారు. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల అనంతరం కాలిఫోర్నియాలో కొత్త కేసులు, మరణాలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.

దీనికితోడు ఇక్కడ రెండో దశ వ్యాప్తి మొదలై, బాధితుల్లో జెనటికల్ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కొత్త వైరస్ స్రైయిన్‌కు గతంలో కంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉండటం మరింత ఆందోళన నెలకొంది. కాలిఫోర్నియాలో నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం ఒక్క లాస్‌ఏంజెలెస్‌ నగరంలోనివే అని అక్కడి వైద్య ఆరోగ్య విభాగం తెలిపింది. ఈ లెక్కల ప్రకారం ప్రతి గంటకు సగటున ఆరుగురు కరోనాతో మృతి చెందుతున్నారు. ఒకానొక సమయంలో కాలిఫోర్నియాలో ఒకేరోజు 290 మరణాలు నమోదయ్యాయి. అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు మరణించారు.

అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. పెరుగుుతన్న కరోనా కేసులతో ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు ఐసీయూ పడకలు దొరకడం లేదు. రోగుల్ని వీల్‌ఛైర్‌లో, హాళ్లలోనే ఉంచి వైద్యం చేస్తున్నారు. వాటిల్లోని రోగుల్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లేందుకు 8 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *