కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను పరిశీలించిన గవర్నర్‌

కొత్త ఏడాదిలో వ్యాక్సిన్‌ రావడం చాలా సంతోషదాయకమని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. రాష్ట్రంలో నాలుగు దశలుగా 80 లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. మొదటి దశలో ఐదు లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు. ఇది అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ అని, అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను గవర్నర్‌ పరిశీలించారు. డ్రైరన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవరన్‌ను పకడ్బందీగా నిర్వహించారని చెప్పారు. డమ్మీ టీకా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, నాంపల్లి ఏరియా దవాఖాన, తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీ, సోమాజిగూడ యశోధ దవాఖానలో డ్రైరన్‌ కొనసాగుతున్నది. తొలి డమ్మీ వ్యాక్సిన్‌ను స్టాఫ్‌ నర్స్‌ సుజాత వేయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *