క్రియాశీలక సభ్యత్వ మూడో విడత కార్యక్రమ తదుపరి కార్యాచరణపై విస్తృత సమావేశం

విజయనగరం: జనసేనపార్టీ అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ జనసైనికుల శ్రేయస్సు కోరి ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ మూడో విడత కార్యక్రమ తదుపరి కార్యాచరణపై విస్తృత సమావేశం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక పాల్ నగర్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీమతి మాత గాయత్రి, హుస్సేన్ ఖాన్, లోకల్ బాయ్ ప్రసాద్, రామకృష్ణ, సాయి కిరణ్ మరియు నాయకులు, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.