కోట సత్తెమ్మ తల్లిని దర్శించుకున్న గురాన అయ్యలు దంపతులు

విజయనగరం: కోట సత్తెమ్మ తల్లి వార్షిక మహోత్సవాలలో భాగంగా రామారాయుడు రోడ్ లో వేంచేసి ఉన్న కోట సత్తెమ్మ తల్లిని గురాన అయ్యలు దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ అమ్మవారిని కొలువు దీర్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ వేదపండితులు, కోట సత్తెమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి దర్శనం భాగ్యాన్ని కల్పించారు. ప్రత్యేక పూజలు అనంతరం వేదాశీర్వచనాన్ని అందజేశారు.