స్మార్ట్ యోజన వెల్పేర్ సొసైటీ సంస్థలో జరిగిన అవకతవకలపై జనసేన కార్యాలయంలో చర్చ

పాడేరు, స్మార్ట్ యోజన వెల్పేర్ సొసైటీ సంస్థలో జరిగినటువంటి అవక తవకలు మరియు యాజమాన్యానికి, సిబ్బందికి మధ్య కలిగిన అనుమానాలు, అపోహలు, జీతబత్యాలు సంస్థ యొక్క భవిష్యత్ వంటి అనేక అంశాలపై జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య అధ్యక్షతన జనసేన పార్టీ కార్యాలయంలో ఉభయులతో సుధీర్ఘామైన సర్చలు జరిపి సమస్య పరిష్కరానికి పలు పరిస్కారమార్గలు వెతికి ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఇందుపూడి సుధాకర్, రజాక్, అయ్యప్ప, స్థానిక ప్రజా సంఘాలు, రాజకీయనాయకులు, జేఏసీ నుంచి రాధాకృష్ణ, ఆనంద్, జల్లి రాజుబాబు, అమర్, రాజారావు, కృష్ణారావు, ప్రసాద్ నాయుడు, ఏజెన్సీ పదాకొండు మండలాల సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.