కార్మికులకు అండగా జనసేన

గుంటూరు, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటూ గత నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు, ఒప్పంద ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాము అండగా నిలుస్తామన్నారు. కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడ చెత్త అక్కడే ఉండటంతో తీవ్ర దుర్గంధం వస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు వర్షాలు పడటంతో కాలువలో ఉన్న మురికి రోడ్ల మీదకి చేరడంతో ఇళ్లల్లో సైతం ఉండలేని స్థితిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సురేష్ కోరారు. కార్యక్రమంలో రెల్లి రాష్ట్ర నాయకులు సోమి ఉదయ్, అజయ్, విజయ్ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కమిటీ నాయకులు సూదా నాగరాజు, బండారు రవీంద్ర, బుడంపాడు కోటి, సాగర్, కిట్టూ, వీర మహిళలు కటకంశెట్టి విజయలక్ష్మి, అరుణ, కార్తిక్, మెహబూబ్ బాషా, జె బీ వై నాయుడు, రమేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.