మత సామరస్యానికి ప్రతీక మొహరం

ఇస్లాం పరిరక్షణకు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన అమరులను స్మరించి, ప్రార్ధించే ఈ మొహరం పవిత్ర దినాన ఇస్లాంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు అందచేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కోరుకున్నారు. మొహరం నాడు అనాదిగా జరుపుకొనే పీర్ల కొలుపు హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా తెలుగునాట నిలుస్తోంది. మత సామరస్యాన్ని పరిఢవిల్ల చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.