క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయ్యాలి.. గంగులయ్య

  • ప్రమాద బీమా కోసం 500 రూపాయలు పెట్టి జనసేన క్రియాశీలక సభ్యత్వం పొందండి…

అల్లూరి జిల్లా, పాడేరు: జనసైనికులకు, వీరమహిళలకు అరకు పార్లమెంట్ పరదిలోగల అరకు, పాడేరు నియోజకవర్గాల వివిధ మండలాలలో జనసేన సిద్ధంతాలు నచ్చిన వారు, జనసేన పార్టీ కోసం పనిచేసే వారు ప్రతి ఒకరు 500 రూపాయలు పెట్టి ప్రమాద బీమా కోసం క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలని జనసేన పార్టీ అరకు, పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. జనసేన పార్టీ యొక్క క్రియశీల సభ్యత్వం చేసుకొన్న వారికీ, దృరదృష్టవశాత్తూ వారు మరణిస్తే, మరణించినాటికీ వారి యొక్క కుటుంబంలో నామీనిగా ఉన్న వారికీ 10లక్షలు రూపాయలు మరియు వారు ప్రమాదంలో గాని, ఆరోగ్యం బాగోలేనప్పుడు వారికీ 50,000 రూపాయలు ట్రీట్మెంట్ కోసం సభ్యత్వం పొందిన వారికీ జనసేన పార్టీ బీమా చేయిస్తుంది. అలాగే ప్రతి జనసైనికులు, వీరమహిళలు, క్రొత్తగా మండల క్రియాశీలక వాలంటీర్లు ప్రతి ఒక్కరూ ఈ క్రియశీలక సభ్యత్వం నమోదును తెలియజేయడం మన కర్తవ్యం. అందుకు ఫిబ్రవరి 10వ తారీకు నుంచి ఫిబ్రవరి 28తారీకు వరకు జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ ఇంచార్జ్ గంగులయ్యా చెప్పారు. అలాగే సభ్యత్వం కార్యక్రమం ప్రతి మండలలో ప్రతిష్టంగా, క్షణంగా వివరాలు చెప్పి 10వ తారీకున జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వం నమోదు విజయవంతం చేయ్యగలరని పేర్కొన్నారు.