పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించండి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: గత ఐదారు రోజులుగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న సమ్మెకు హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం జీవో51 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల చేత అన్ని రకాల పనులు చేయిస్తుందన్నారు. ఈ మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి, వారికి తగిన వేతనం ఇవ్వాలని జనసేన పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వొద్దమల్ల విజయ్, తోడేటి సంపత్, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.