ప్రజలు చెప్పులతో కొట్టి తరిమేసేరోజు దగ్గరలోనే

  • వైసీపీ నాయకులపై పితాని బాలకృష్ణ ఫైర్

ముమ్మిడివరం: వైసిపి నాయకుల తీరుపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ ఫైర్ అయ్యారు. మంగళవారం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసిపి నాయకులను ప్రజలు చెప్పులతో కొట్టి తరిమేసేరోజు దగ్గరలో ఉంది. మంత్రులను పిచ్చికుక్కల్లా తయారు చేసి బందించి ఉంచి, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేక బోనులోంచి వదిలి కుక్కల్లా మొరిగిస్తున్నారు. వాసిరెడ్డి పద్మకు చేతనైతే రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కి సంబంధించి కేసుల్లో పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించాలి.. అది చేయలేక పవన్ కు నోటీసులు ఇవ్వడం దారుణం. ఎస్సీ, బడుగు బలహీన వర్గాల అండతో అధికారంలోకి వచ్చి, నీ పార్టీ వాళ్లు నీ అండతో నేడు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే దానిని ఖండించకుండా దళిత, బిసి, బడుగు బలహీన వర్గాలను అనగదొక్కాలనే దోరనిలో నీ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ రాష్ట్రం కాదు దేశం నుండి పారిపోయో రోజులు దగ్గర లోనే ఉన్నాయి. వాలంటీర్లును చిన్నబుచ్చాలని పవన్ భావించడం లేదు. వ్యవస్థలో జరుగుతున్న తప్పులు ఎత్తి చూపారు. వెట్టిచాకిరి చేస్తున్న వాలంటీర్లును గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ చూస్తారని పితాని బాలకృష్ణ పేర్కొన్నారు.