నందమూరి బాలకృష్ణకి మద్దతుగా ఆకుల ఉమేష్ ఎన్నికల ప్రచారం

హిందూపురం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నందమూరి బాలకృష్ణకి మద్దతుగా జనసేన పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో కోటిపి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోటిపిలో, హిందూపురం మునిసిపాలిటీ 1వ వార్డ్ కొల్లకుంటలో ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు శివ శంకర్, హిందూపురం పట్టణ, రూరల్ అధ్యక్షులు కొల్లకుంట శేఖర్, చక్రవర్తి, భాస్కర్, ప్రభు, విజయ్ జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *