స్థలం కేటాయించండి.. జనసేన ఆధ్వర్యంలో బస్సు షెల్టర్ నిర్మిస్తాము
- పొన్నలూరు ఎం.ఆర్.ఓ కు జనసేన వినతిపత్రం
- దాతలు మంచి హృదయంతో ముందుకు రావాలి, సహకరించాలి
- ప్రధాన రహదారికి రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి
కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ నిర్మిస్తాము, స్థలం కేటాయించండని పొన్నలూరు ఎం.ఆర్.ఓ శ్రావణ్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల జనసేన అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఎం.ఆర్.ఓ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ విద్యాలయాలకు వెళ్ళే ప్రజలతో నిత్యం రద్దీగా ఉంటుంది. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా ప్రజలు నిలబడటానికి బస్సు షెల్టర్ లేకపోవడం వలన ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు, బస్ షెల్టర్ నిర్మించడానికి ఎం.ఆర్.ఓ గారు స్థలం కేటాయిస్తే, జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా బస్సు షెల్టర్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రధాన రహదారిలో స్పీడ్ బ్రేకర్లు కూడా వేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం నాయుడు(ఉపాధ్యక్షుడు), ప్రధాన కార్యదర్శి ఖాదర్ బాషా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-28-at-4.06.33-PM-1024x799.jpeg)