ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 22వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పైనాపురం గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 22వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని పైనాపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వివరించి రాబోవు ఎన్నికలలో జనసేన పార్టీకి ఓటు వేయమని కోరుతూ ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలూరు పెంచల నరసింహా, తాండ్ర శ్రీను, పట్టపు నాగరాజు, పట్టపు మహేష్, పట్టపు నవీన్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.