బొలిశెట్టి జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలోని 3రోజు సేవా కార్యక్రమాలలో భాగంగా శనివారం బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు శుభ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బి.సి యువజన అధ్యక్షులు అత్తిలి బాబి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఆర్.టి.సి బస్టాండ్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు వీరమహిళ కళ్యాణి ఆధ్వర్యంలో స్టానిక 5వ వార్డులో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక తాడేపల్లిగూడెం కొండయ్య చెరువు వద్ద లార్డ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమము నందు పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. అత్తిలి బాబి మాట్లాడుతూ జనసేన పార్టీలో బడుగు బలహీనర్గాలకు పెద్దపీట వేసి బి.సి లను ముందుంచి బడుగు బలహీనవర్గాల ఆత్మ గౌరవం, సమ సమాజ పునర్నిర్మాణం కోసం తాడేపల్లిగూడెంలో తనవంతు సహాయ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరాయి అహర్నిశలు కృషి చేస్తు బీసీలందరిని కలుపుకొని ముందుకు నడిచే వ్యక్తి మా బొలిశెట్టి శ్రీనివాస్ అని అన్నారు. ఈ కార్యక్రమానికి అడబాలనారాయణమూర్తి, రామ్ శెట్టి, వర్తనపల్లి కాశి, పుల్ల బాబి, అడప ప్రసాదు కేశవబట్ల విజయ్, లింగం శ్రీను, మట్టా రామకృష్ణ, పాలూరి బూరయ్య, కాజులూరి మల్లేష్, నీలపాల దినేష్, మాదాసు ఇందు, నల్లకంచు రాంబాబు, రౌతు సోమరాజు, చేపల రమేష్, స్వామి నాయుడు, బయనపాలేపు ముఖేష్, సోమశంకర్, పిడుగు రామ్మోహన్, కిరణ్, రాకుర్తి కిరణ్, రత్నకుమారి, సోమలమ్మ, మధుమతి, లక్ష్మీప్రసన్న, విజయ, తులసి, జనసేన నాయకులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.