జనసేన కొత్తవలస టౌన్ పార్టీ కమిటీ ప్రకటన

శృంగవరపుకోట: జనసేన శృంగవరపుకోట నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తవలస పార్టీ కార్యాలయంలో 23 సభ్యులతో కూడిన కొత్తవలస టౌన్ కమిటీ నియమించడం జరిగింది. గాలి అప్పారావుని కొత్తవలస టౌన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా అంతకాపల్లి లక్ష్మణరావు మరియు ఎలిమిరెడ్డి లక్ష్మీకాంత్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా రాందాస్ కాశీ మరియు బంధం సత్యనారాయణ నియమితులయ్యారు. మరియు 6 సభ్యులను కార్యదర్శులుగాను, 12 సభ్యులను సంయుక్త కార్యదర్శులుగాను గాను నియమించడం జరిగింది. నూతన కమిటీకి అభినందనలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ కోరడం జరిగింది.