హైదరాబాద్ పరిధిలో మరో 100 బస్తీ దవాఖానాల ఏర్పాటు: తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ పరిధిలో మరో 100 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఅర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 197 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతీ రోజు 25 వేల మందికి పైగా ప్రాధమిక వైద్య సేవలు అందుతున్నాయని.. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఇవి విజయవంతమయ్యాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

శుక్రవారం బస్తీ దవాఖానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బస్తీ దవాఖానాలు హైదరాబాద్ పరిధిలో విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ సేవల పట్ల పేదలు సంతృప్తిగా ఉన్నారని.. వచ్చే 2-3 నెలల్లో మరో వంద దవాఖానాలు ప్రారంభించాలని అధికారులకు మంత్రి కేటీఅర్ తెలిపారు.