తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్..

తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుమురంభీం- ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కదంబా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరి గాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

ఘటనాస్థలంలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్‌ అనే మరో కీలక నేత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అతడి కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం మావోయిస్టులకు, గ్రే హౌండ్స్ దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.