ఢిల్లీలో మరోవారం లాక్డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను మరో వారం రోజుల పాటు పొడిగినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3(సోమవారం) ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. నిన్న రికార్డు స్థాయిలో 357 మరణాలు సంభవించాయని తెలిపారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా లాక్డౌన్ పొడిగించాలనే కోరారు అని కేజ్రీవాల్ వెల్లడించారు.
We had imposed a 6-day lockdown in Delhi. The lockdown is being extended to next Monday till 5 am: Delhi CM Arvind Kejriwal #COVID19 pic.twitter.com/s1eHgZmaHN
— ANI (@ANI) April 25, 2021