ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం
దుబాయ్ వేదికగా బుధవారం ఐపీఎల్లో భాగంగా 30వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఢిల్లీ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్లో 13 పరుగుల తేడాతో ఆర్ఆర్పై విక్టరీ కొట్టింది డీసీ టీమ్.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లుతో 53 పరుగులతో రాణించాడు.. మొత్తంగా 161 పరుగులు చేసి.. రాజస్థాన్ ముందు 162 పరుగుల టార్గెట్ను ఉంచింది.. ఇక, 162 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ తేలిపోయింది.. 20 ఓవర్లలో 148 పరుగులకే పరిమితమైందా జట్టు.. బెన్స్టోక్స్ 41 పరుగులతో ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు.