గుజరాత్‌లో పట్టుకున్న హెరాయిన్‌తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్

ఇటీవల గుజరాత్‌లో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకోగా, అక్రమ రవాణాదారులకు ఏపీతో లింకులున్నాయంటూ వార్తలొచ్చాయి. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ కు ఏపీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై డీఆర్ఐ నార్కొటిక్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని వెల్లడించారు.

ఈ అంశంలో విజయవాడను చిరునామాగా మాత్రమే వాడుకున్నారని, అంతకుమించి నగరంలో ఎలాంటి కార్యకలాపాలు లేవని సవాంగ్ వివరించారు. హెరాయిన్ ఘటనలో చెన్నై కేంద్రంగానే మొత్తం లావాదేవీలు జరిగాయని తెలిపారు. వాస్తవాలు ఇలావుంటే, సీఎం కార్యాలయానికి సమీపంలోనే ఇదంతా జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.