ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 45వ రోజు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం 45వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, చిన్న కనపర్తి గ్రామంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. బాణసంచా, పూల వర్షంతో ఘనస్వాగతం పలికిన జనసైనికులు. పట్టణంలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు, యువతకి ఉద్యోగాలు లేవని ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్ర శేఖర్, జనసైనికులు రవి, కిషోర్, గురవయ్య, ముత్యాలు, ఆనంద్, రమేష్, సురేష్, నాయకులు దండి రాఘవయ్య, నాయకులు తోట గణేష్, కావలి శివకుమార్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, ప్రమోద్, లక్ష్మి, రాజ్య లక్ష్మి, శారద, కవిత, సురేష్, రాజేష్, గురవయ్య, హేమంత్ గౌడ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.