అరకు – లకేపుట్టు గ్రామంలో ఇంటింటికి జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు

  • జనసేన పార్టీ నాయకులకు ఘనస్వాగతం పలికిన గిరిజనులు
  • సుమారు 100 మంది గిరిజనులకి బట్టలు పంపిణి చేసిన జనసేన బృందం
  • ఇంటింటా జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు
  • లకే పుట్టు గ్రామంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలి
  • లకే పుట్టు గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా. జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యుడు పాల్ట సింగ్ ప్రశాంత్. జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం పెదబయలు మండలము, అడుగుల పుట్టు పంచాయితీ పరిధిలోని లకే పుట్టు గ్రామంలో గురువారము జనసేన మాజీ (ఏంపిటిసి) సాయిబాబా దూరియా, పల్టాసింగ్ ప్రశాంత్, జాగరపు పవన్ కుమార్ ఆధ్వరంలో ఆయా గ్రామాలలో పర్యటించి గ్రామస్తులతో సమావేశమై జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు ఇంటింటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యను పరిశీలించి, డ్రైనేజ్ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని గ్రామస్తులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పుకొనే ఈ ప్రభుత్వం మారుమూల ప్రాంతమైన లకే పుట్టు (పిటిజి) గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ, రోడ్ల సదుపాయాలతో జగనన్న ఇల్లు కాలనీలను నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముందుగా పర్యటించిన జనసేన నాయకులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుమారు వందమంది గిరిజనులకు జనసేన పార్టీ నాయకులుమాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా ఆధ్వర్యంలో బట్టలు (వస్త్రాలు) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పెదబయలు మండలం నుంచి కామరాజు, నాగరాజు, హుకుంపేట మండలం నుంచి చుంచు రాజు బాబు, పాడేరు మండలం నాయకులు నందోలి మురళీ, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.